విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

-

విశాఖలో రౌడీ షీటర్ బండ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖపట్నం ఎంవిపి కాలనీ సత్యం జంక్షన్ లోని జయభేరి వద్ద ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. నిన్న రాత్రి సమయంలో తన ఇంటి బయట కూర్చున్న బండ రెడ్డి అనే వ్యక్తి మీద ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇనప రాడ్డు బండ రెడ్డి తలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయంలో జరిగిన ఈ హత్య విశాఖ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

murder
murder

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపధ్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news