ఫిబ్ర‌వరిలో థీయేట‌ర్స్‌లో శ‌ర్వ‌నంద్ సినిమా

-

టాలీవుడ్ హీరో శ‌ర్వ‌నంద్ హీరోగా వ‌స్తున్న తాజా సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. వ‌చ్చె నెల 25 వ తేదిన థీయేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌స్తున్నట్టు చిత్ర బృందం ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. కాగ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాను డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్నారు. అలాగే శ్రీ లక్ష్మి వెంక‌టేశ్వ‌ర్ సినిమాస్ అనే బ్యాన‌ర్ పై చెరుకూరి సుధాక‌ర్ నిర్మిస్తున్నారు.

కాగ ఈ సినిమాను పక్క ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శ‌ర్వ‌నంద్ కు జోడీగా నేషన‌ల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ న‌టీ న‌టులు కుష్బూ, రాధిక శ‌ర‌త్ కుమార్ తో పాటు ఊర్వ‌శీ నటిస్తున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగ ఈ సినిమా త‌ప్ప‌క హిట్ అవుతుంద‌ని శ‌ర్వ‌నంద్ అభిమానులు దీమా వ్య‌క్తం చేస్తున్నారు. కాగ శ‌ర్వ‌నంద్ ఈ సినిమాతో పాటు ఒకే ఒక జీవితం అనే సినిమాలోనూ న‌టిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news