టిడిపికి షాక్.. చంద్రబాబు సొంత నియోజకవర్గం నుండి వైసీపీలోకి వలసలు

-

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టిడిపి పార్టీకి షాక్ తగిలింది. టిడిపికి గుడ్ బై చెప్పి 100మంది కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు. గుడిపల్లి మండలం లోని వంద మంది టిడిపి కార్యకర్తలు సభ్యత్వ కార్డును ప్రదర్శించి వైసిపి పార్టీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కుప్పం ఇన్చార్జి ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంలో పార్టీలో చేరారు టిడిపి నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి మూడేళ్ల పరిపాలన చూశాకే కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరాలి అని స్థానికులు కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం లభిస్తుందన్నారు. రానున్న రోజుల్లో కుప్పం నుండి మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 2024 ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ విజయం తధ్యమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news