ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. అలా చేస్తే మీ ఉద్యోగం పోయినట్లే..

-

పెళ్ళి అనేది మనిషి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం..అందుకే ఎవరికీ ఉన్నంతలో వాళ్ళు ఘనంగా పెళ్ళి చేసుకుంటారు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలో కూడా విడాకులు, రెండో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండో పెళ్లి విషయంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ కారణం వల్లనైనా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని వెల్లడించింది.

రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ప్రభుత్వోద్యోగులకు కొన్ని నిబంధనలు రూపొందించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.ఎవరైనా ఉద్యోగి తన భాగస్వామి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా తాము పని చేస్తున్న డిపార్ట్‌మెంట్ హెడ్‌కు సమాచారమిచ్చి అనుమతి తీసుకోవాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి వస్తేనే పెళ్లి చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగిని రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటే చట్టపరంగా విడాకులు తీసుకున్నట్లు రుజువులు సమర్పించాలి.

అంతేకాదు సంబంధించిన ఆధారాలను డిపార్టుమెంటుకు సమర్పించాలి. ఒకవేళ జీవిత భాగస్వామి మరణిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్య/భర్త ఉండగానే, వారికి విడాకులు ఇవ్వకుండా మరొకని వివాహం చేసుకుంటారు. ఇలాంటి కేసుల్లో మొదటి భార్య/భర్త అభ్యంతరం చెప్పడం సహజం..అనుమతి తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్న ఉద్యోగి సర్వీస్‌లో ఉండగానే మరణిస్తే ఆ వ్యక్తి రెండో భార్య/భర్తకు, వారి పిల్లలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు అందవు. అలాంటి వారు వారసత్వంగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులవుతారు…ఆ తర్వాత ఆ ఉద్యోగం మొదటి భార్య పిల్లలకు వస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news