మెగా, నందమూరి ఫాన్స్ కి షాక్…!

-

ఇప్పుడు మన తెలుగులో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాలు రెండు ఉన్నాయి. ఒకటి ఆచార్య అయితే రెండు ఆర్ఆర్ఆర్. ట్రిపుల్ ఆర్ కోసం ప్రేక్షకులు ముందు నుంచి కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా ప్రకటన నుంచి షూటింగ్ వరకు ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్ర వరకు అన్నీ కూడా ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత కూడా పూర్తి స్థాయిలో రాలేదు.

అయితే ఈ రెండు సినిమాలను మరో ఆరు నెలలు వాయిదా వేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. కరోనా కారణంగా ఈ సినిమాలు షూటింగ్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాలను రీ షూట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడు లాక్ డౌన్ ఆగిపోతుంది అనేది స్పష్టంగా తెలియదు. దీనితో షూటింగ్ ఆలస్యం అవుతుంది కాబట్టి… దానికి తోడు రీ షూట్ కూడా ఉంది కాబట్టి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news