డైరెక్టర్ హరి శంకర్ పవన్ చిత్రంపై షాకింగ్ అప్డేట్..!!

-

టాలీవుడ్ లో నటుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఒకవైపు సినిమాలలో ఉంటూనే మరొకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ కు దూరంగా ఉంటున్నారు. కానీ తన తదుపరి చిత్రాలను మాత్రం వరుస పెట్టి ప్రకటిస్తూనే ఉన్నారు.

అలా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ చిత్రానికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ప్రకటించలేదు. దీంతో వీరి సినిమా క్యాన్సిల్ అయింది అని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈరోజు ఉదయం ఎట్టకేలకు ఈ సినిమా నుంచి భారీ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. గడిచిన వారం క్రిందట డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు డైరెక్టర్ హరిశంకర్ తో చేయబోతున్న సినిమా గురించి ఒక టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ క్రేజీ పోస్టర్ తో ఇప్పుడు ఒకనౌన్స్మెంట్ చేశారు. పోస్టర్లో మాత్రం గతంలో ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ పోస్టర్ లాగా కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు వారి బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. క్యాప్షన్ కు మనమల్ని ఎవడ్రా ఆపేది అనే ఒక కొత్త ట్యాగ్ యాడ్ చేయడం హైలెట్ గా మారుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు ని ఇప్పుడు తాజాగా అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్ అభిమానులకు ఒక షాకింగ్ ట్రీట్ అని చెప్పవచ్చు. మరీ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news