రేవంత్ , శ్రీహాన్లతో సమానంగా పారితోషకం అందుకున్న శ్రీ సత్య.. ఎన్ని లక్షలంటే..?

-

బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని సందడి చేసిన శ్రీ సత్య 15 వారాల పాటు హౌస్ లో కొనసాగింది. అయితే ఈ షోలో పాల్గొన్నందుకు ఆమెకు ఎంత పారితోషకం ఇచ్చారు అనేది ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. మోడల్గా తన కెరియర్ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత సినిమాలలో.. బుల్లితెరపై సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని టాప్ సిక్స్ కంటెంట్ గా నిలిచింది. గ్రాండ్ ఫినాలే వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా ఆమె ఎలిమినేట్ అయ్యింది. టైటిల్ రేసు నుంచి ఒక్కరోజు ముందే ఆమె తప్పుకోవాల్సి వచ్చింది.

ఐదవ వారమే ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆమె గ్లామర్ పరంగా.. చలాకీతనం.. తెలివితో వ్యవహరించడం.. మంచి ఫాలోయింగ్ ఉండడం.. హౌస్ లో మేల్ కంటెస్టెంట్లతో కాస్త పులిహోర కలపడం వంటి వాటి కారణంగా ఆమె చివరి వరకు కొనసాగింది . అందరి మనసులు దోచుకుంది . బలమైన లక్ష్యంతో హౌస్ లోకి వచ్చిన శ్రీ సత్య ఒక్క అడుగు దూరంలో టాప్ ఫైవ్ నుంచి ఎలిమినేట్ అవ్వడం గమనార్హం. ఇకపోతే హౌస్ లో ఉన్నందుకు గాను ఈమెకు పారితోషకం భారీగానే లభించింది అని వార్తలు వినిపిస్తున్నాయి . ఇందులో షో మొత్తంగా సుమారుగా రూ.34 లక్షల వరకు ఈమెకు పారితోషకం లభించిందట. ఈ లెక్కను చూసుకుంటే ఈమెకు రోజుకు 23 వేల రూపాయల వరకు పారితోషకం లభించిందని సమాచారం.

అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది . ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ , రన్నర్ శ్రీహాన్లకు సమానంగా శ్రీ సత్య పారితోషకం తీసుకుందని సమాచారం. ఏదిఏమైనా అటు ఇటుగా టాప్ కంటెస్టెంట్ ల రేంజ్ లో ఈమె పారితోషకం తీసుకుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news