సింగరేణిలో ప్రమాదం.. గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికుల దుర్మరణం..!

-

సింగరేణిలో ప్రమాదం చోటుచేసుకుంది. గనిపై కప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారని సమాచారం. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ -3 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. గనిపై కప్పు కూలడంతో నలుగురు కార్మికులు మరణించారు. మొదటి షిఫ్టు లోభాగంగా మైన్ లో బొగ్గు వెలికి తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

ఉన్నట్టుండి ఒక్కసారిగా పై కప్పు కూలి బొగ్గు పెల్లలు మీదపడ్డాయి. దీంతో బొగ్గు పెల్లల కింద చిక్కుకున్న  కార్మికులు అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని సింగరేణి రెస్క్యూ  సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. బొగ్గు గనిలో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చాాలా వరకు బొగ్గు గనుల్లో ప్రమాదాలు తగ్గాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news