చీటింగ్ ఆరోపణల పై నోరు విప్పిన సింగర్ యశస్వి..!

-

తాజాగా సింగర్ యశస్వి పై నవసేన నిర్వాహకరాలు ఫరా కౌసర్ తమ సంస్థ పేరును వాడుకోవడమే కాకుండా తానే నడుపుతున్నట్లు చెప్పుకున్న యశస్విపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇతడి పై ట్రోలింగ్ మొదలైంది. చాలామంది అతనిని తిట్టిపోస్తున్నారు . ఈ క్రమంలోనే తనపై వస్తున్న విమర్శలు , ట్రోలింగ్ పై సింగర్ యశస్వి స్పందించాడు.

సింగర్ యశస్వి మాట్లాడుతూ.. నవసేవ ఫౌండేషన్ కి, అందులోని పిల్లలకు సాయం చేస్తున్నట్లు.. వారిని దత్తత తీసుకున్నట్లు నేనెక్కడ అనలేదు.. నేను వాళ్ళ దగ్గరకి కూడా వెళ్లలేదు.. నాకు ఈ ఫౌండేషన్ కి అసలు సంబంధం లేదు.. మేమంతా సాధ్య ఫౌండేషన్ కు సహాయం చేస్తుంటాము. ఈ ఫౌండేషన్ తమకు నచ్చిన మరికొన్ని సంస్థలకు చేయూత అందిస్తుంది . మా బ్రదర్స్ కూడా సాధ్య ఫౌండేషన్ కి చేతనైన సహాయం చేశారు. దీని ద్వారా వారు నవసేన ట్రస్టుకి మూడు, నాలుగు సార్లు హెల్ప్ చేశారు.. కాబట్టి వాళ్లతో ఆల్ ద బెస్ట్ చెప్పించుకుంటామన్నారు. అందులో భాగంగానే నవసేన ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా ఎదురుగానే పిల్లలతో ఆల్ ద బెస్ట్ చెప్పిస్తూ వీడియోలు చేశారు..

నా అభిమానులు కూడా అదే ట్రస్టులో పిల్లలతో కేక్ కట్ చేసి విషెస్ చెప్పించారు. ఈ వీడియోలన్నింటిని చిన్నగా ఎడిట్ చేసి ప్రోమోలో యాడ్ చేశారు.. ఇప్పుడు ఇందులో నవసేన అన్న బోర్డు కనిపించింది. కానీ పిల్లలను చూపించలేదు అని ఫరా అడిగారు..దీనికి జస్ట్ ప్రోమో ని ఎపిసోడ్ లో అంతా వస్తుందని క్లారిటీ ఇచ్చాను.. ప్రోమో కూడా డిలీట్ చేయించా. పసిపిల్లలను అడ్డుపెట్టుకొని నేనెందుకు పేరు తెచ్చుకోవాలని అనుకుంటాను అని అన్నారు యశస్వి.. మా సంస్థ బోర్డు వారు వాడారు కాబట్టి 9 నెలల పాటు అనాధాశ్రమాన్ని దత్తత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫరా.. అంతేకాదు యశస్వి మాట్లాడుతూ.. దత్తత ఎలా తీసుకుంటాను.. నాకు ఉన్నంతలో సహాయం చేస్తాను.. అని అన్నాడు.. దీంతో ఆమె లీగల్ గా వెళ్తాను అనడంతో.. మాట విననప్పుడు ఏం చేస్తాను సరేనన్నాను కానీ నాకు బుద్ధి తక్కువ అయి ఎపిసోడ్ కు వీడియోలు ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు యశస్వి.

Read more RELATED
Recommended to you

Latest news