నేడే సిరివెన్నెల అంత్యక్రియలు…హాజరుకానున్న ప్రముఖులు…!

-

సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న అస్తమించిన సంగతి తెలిసిందే. 4 :07 నిమిషాలకు సిరివెన్నెల తుది శ్వాస విడిచారు. న్యుమోనియా తో ఈ నెల 24 న సికింద్రాబాద్ కిమ్స్ లో సీతారామశాస్త్రి చేరారు. ఆయన లంగ్ క్యాన్సర్ తో ఆరేళ్ల నుండి బాధపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. దానికి సంబందించిన ఆపరేషన్ కూడా చేసినట్టు చెబుతున్నారు.

అయితే మరోసారి ఆరోగ్యం క్షీణంచడంతో సిరివెన్నెల చికిత్స పొందుతూ కన్ను మూశారు. కాగా ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కిమ్స్ ఆస్పత్రి నుండి ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. కాగా అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో భౌతికకాయాన్ని ఉంచారు. నేడు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక అంత్యక్రియలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఏపీ సర్కార్ తరపున మంత్రి పేర్ని నాని అంత్యక్రియకు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news