ఇన్‌స్టాలో మహేశ్‌ కూతురు సితార ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏమైంది..?

-

ఘట్టమనేని మహేష్ బాబు ఇంట్లో ఓ విషాదం చోటుచేసుకుంది. వారు గత ఏడేళ్లుగా పెంచుకుంటున్న పెట్ డాగ్ చనిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న ప్లూటో (పెట్ డాగ్) మృతి చెందడంతో నమ్రత శిరోద్కర్, కూతురు సితార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. మహేష్ బాబు కూతురు సితార మనసు ఆకాశం అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంది.రీసెంట్ గా తన బర్త్ డే స్పెషల్ గా (జూలై 20న) తన తండ్రి మహేష్ ఫౌండేషన్ లోని అమ్మాయిలతో సరదాగా గడిపి వారికి సైకిల్స్ ను అందించింది.

Sitara – Pluto: Pluto's death.. Sitara's emotional post

అలాగే ఓ జ్యూవెలరీ యాడ్ కోసం దాదాపు రూ. కోటి రెమ్యూనరేషన్ అందుకుని, అమౌంట్ మొత్తాన్ని సితార ఛారిటీ కి ఇవ్వడం విశేషం.ఇవాళ (ఆగస్ట్ 17న) మహేష్ బాబు ఇంట్లో గత ఏడేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకున్నపెట్ డాగ్(ప్లూటో) చనిపోయింది. సితార ఎప్పుడు ప్లూటోతో ఎంతో చక్కగా ఆడుకుంటుందని సమాచారం.ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న ప్లూటో మృతి చెందడంతో నమ్రత శిరోద్కర్, కూతురు సితార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు సితార తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చేసిన ‘ఏడేళ్ల బంధం.. మిస్ యూ ప్లూటో’’ అంటూ షేర్ చేయగా.. దానికి స్పందించిన నమ్రత.. ‘‘ప్లూటో ఎక్కడికి వెళ్లదు.. మనతోనే, మన ప్రార్థనలో ఎప్పటికీ మనతోనే ఉంటుంది’’ అంటూ సితారకు ధైర్యం చెప్పింది. అంతే కాకుండా.. ఘట్టమనేని అభిమానులు సైతం ఆ పోస్ట్‌కు రిప్లైలు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news