SMAT 2023: రాజస్థాన్ ప్లేయర్ “రియాన్ పరాగ్” వరల్డ్ రికార్డ్ !

-

ప్రస్తుతం ఇండియా దేశవాళీ లీగ్ లలో భాగంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ లీగ్ లో అస్సాం టీం కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రియాన్ పరాగ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడట. టీ 20 క్రికెట్ చరిత్రలోనే ఏ ప్లేయర్ కూడా వరుసగా ఆరు అర్ద సెంచరీ లు చేశాడు.. ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించని ఈ రికార్డ్ తో చరిత్రను సృష్టించాడు. ఈ లీగ్ లో రియాన్ పరాగ్ వరుసగా 61, 76, 53, 76, 72, 57, స్కోర్లను సాధించి అదరగొడుతున్నాడు. బ్యాట్ తో రాణించిన రియాన్ పరాగ్ బౌలింగ్ లోనూ తొమ్మిది వికెట్లు పడగొట్టి ఆల్ రౌండర్ గా ఉన్నాడు. కాగా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు..

గత సీజన్ లోనూ అంచనాలకు తగినట్లు రాణించకపోవడంతో ఇతన్ని వదిలేసుకోవాలంటూ ఆలోచనలో ఉంది. కానీ ఈ ప్రదర్శన చూస్తే ఖచ్చితంగా వదిలే ఛాన్సెస్ లేవని క్లియర్ గా అర్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news