SMAT FINAL 2023: రాణించిన అర్ష్ దీప్ సింగ్, పంజాబ్ దే ట్రోఫీ !

-

ఈ రోజు మొహాలీలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సీజన్ 2023 లో పంజాబ్ జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ఫైనల్ మ్యాచ్ లో బరోడా మరియు పంజాబ్ జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్ లలో 224 పరుగుల భారీ టార్గెట్ ను బరోడా ముందు ఉంచింది. కానీ మొదటి నుండి కూడా ఏ దశలోనూ బరోడా లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు.. కానీ ఆఖరి మూడు ఓవర్ లలో 57 పరుగులు అవసరం అయిన దశలో క్రీజులోకి వచ్చిన విష్ణు సోలంకి సిద్దార్ధ్ కౌల్ బౌలింగ్ లో పరుగులు రాబట్టుకున్నాడు. దీనితో ఆఖరి రెండు ఓవర్ లలో 33 పరుగులు చేయాల్సి వచ్చింది, కానీ ఆ ఓవర్ ను వేసిన ఇండియన్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్ తో బరోడా ఓటమి ఖరారు అయింది.

పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అన్మోల్ ప్రీత్ సింగ్, వధేరా లను జట్టు యాజమాన్యం ప్రశంసలతో ముంచెత్తింది. ఇక టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ కు మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు వరించింది.

Read more RELATED
Recommended to you

Latest news