కూతురు, కొడుకు, మేనల్లుడు పాలన పోతుందని మోడీని దింపేస్తారా కేసీఆర్..? – సోము వీర్రాజు

-

రాజధాని నిర్మాణంపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి సంతకం రాజధాని నిర్మాణ పనుల పైనే అంటూ స్పషం చేశారు. రాజధాని నిర్మాణం మూడేళ్లల్లో పూర్తి చేస్తామని.. అధికారంలోకి వస్తే రాజధాని పనుల మీదే బిజెపీ మొదటి సంతకం చేస్తుందని వెల్లడించారు. ఒకాయన ఎక్కడికెళ్లినా ఆ మోడల్ కేపిటల్ కడతానంటారని.. మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజధానిని విశాఖకు తీసుకెళ్తానంటాడు ఇంకొకాయన అంటూ చురకలు అంటించారు.

బీజేపీ అమరావతిలోనే రాజధాని కడుతుందని.. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మోడీ అభివృద్ధి విధానమే అని పేర్కొన్నారు. దీనిపై ఏ పార్టీతోనైనా చర్చకు నేను సిద్ధమని.. కూతురు, కొడుకు, మేనల్లుడు పాలన పోతుందని మోడిని దింపేస్తారా కేసీఆర్..? అని నిలదీశారు.

ఒకాయన కొడుకు సన్నబడ్డాడు.. ఆయన కూడా ఏదో మాట్లాడతాడు… డ్రైవర్లను చంపేస్తారు.. అధికారులను చెంపదెబ్బ కొడతారు.. అలాంటి వాళ్ళకు 151 సీట్లా..? అని నిలదీశారు. బీజేపీవి వంద రత్నాలు.. వాళ్ళవి నవరత్నాలు అని.. దమ్ముంటే పోలవరంపై ఏ రాజకీయ నాయకుడైనా మాతో చర్చించవచ్చని పేర్కొన్నారు. వైసీపీ అరాచకాలకు బీజేవైఎం అడ్డుకట్ట వేయాలని.. బీజేపీ సిద్ధాంత పరమైన సంస్ధ అని పేర్కొన్నారు. రాజకీయం చాలా పార్టీలకి వ్యాపారమని.. రాష్ట్రాలన్నిటిని అనుసంధానం చేస్తున్నది బీజేపీనేనని వెల్లడించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం ఉండాలి.. బాబర్ కట్టడం ఉండకూడదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version