మోడీ తనకు తానే గొప్పగా భావిస్తున్నారు: సోనియా

-

నరేంద్ర మోడీ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలని బిజెపిలో చేరాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. శనివారం జయపూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. బిజెపి హయంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్య సంస్థలు నాశనమయ్యాయి అని అన్నారు.

అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చడానికి బిజెపి కుట్ర పన్నుతోందని విమర్శించారు. గత పది ఏళ్ళల్లో నిరుద్యోగం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయినా బీజేపీ దానిని పట్టించుకోవట్లేదు అన్నారు. మోడీ తనకి తానే గొప్పగా భావించుకుంటూ ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఈ దేశం నిర్మాణం కోసం పూర్వీకులు రక్తం ధారపోసారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news