‘దేశ్ కే మెంటర్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

-

రియల్‌ హీరో సోనూసూద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా సమయంలో పేద ప్రజలకు సహాయం చేసి… అందరి మనసుల్లో మంచి స్థానం దక్కించుకున్నారు సోనూసూద్‌. అయితే… ఇప్పుడు ఆయన మరో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ”దేశ్‌ కే మెంటార్స్‌ ” కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

కేజ్రీవాల్‌ ప్రభుత్వం విద్యార్థుల కోసం ”దేశ్‌ కే మెంటార్స్‌ ” కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అయితే… ఈ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా సోనూసూద్‌ వ్యహరించనున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని.. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీనికి సోనూసూద్‌ బ్రాంబ్‌ అంబాసిడర్‌ గా ఒప్పుకోవడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు సీఎం కేజ్రీవాల్‌.

Read more RELATED
Recommended to you

Latest news