అయోధ్య రాముడిని దర్శించుకున్న సౌతాఫ్రికా క్రికెటర్..!

-

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ తొలిసారి ఐపీఎల్ లో భాగం కానున్నారు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ కి మహరాజ్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన మినీ వేలంలో రూ.50లక్షల కనీస ధరకు మహరాజ్ ని లక్నో సొంతం చేసుకుంది. ఇప్పటికే లక్నో జట్టుతో కేశవ్ మహరాజ్ కలిశాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రస్తుతం లక్నోలోని ఏక్నా స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ తరుణంలో అయోధ్య రామమందిరాన్ని మహారాజ్ సందర్శించాడు.

మందిరంలో బాల రాముడి విగ్రహాన్ని ఈ ప్రోటీస్ స్టార్ దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోసల్ మీడియాలో కేశవ్ షేర్ చేశాడు. అందుకు క్యాప్షన్ గా జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చాడు. అందుకు క్యాప్షన్ గా జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫొటో సోషల్మీడియాలో వైరల్ గా మారింది. భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ రామభక్తుడు అనే విషయం చాలా మందికి తెలియదు. కొద్ది మందికి మాత్రమే తెలుసు.  ఈ మధ్యకాలంలో అతడు బ్యాటింగ్ కి వచ్చినప్పుడు రామ్ సియా రామ్ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news