BREAKING : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం..!

-

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీని ప్రభావం ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పై అధికంగా ఉంది. లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్‌ మరింతగా విజృంభిస్తోంది. ఇటీవలే ప్రముఖ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆయన చెన్నైలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు.

అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో నిన్న రాత్రి ఐసీయూకి తరలించారు. తాజాగా బాలూకు వైద్యం చేస్తోన్న ఎంజీఎం డాక్టర్లు ఆయన హెల్త్ కండిషన్ పై బులెటన్ విడుదల చేసారు. ప్రస్తుతం ఎంజీఎం నిపుణులైన డాక్టర్లు ఎస్పీ బాలుని పర్యవేక్షిస్తున్నారు. లైఫ్ సపోర్ట్‌ తో చికిత్స అందిస్తున్నామని.. బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని ఎంజీఎం హాస్పిటల్స్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news