IPL 2023 : ముంబై ఇండియన్స్ కు మరో భారీ షాక్…కీలక ప్లేయర్ అవుట్!

-

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’. ఈ ఐపీ ఎల్‌ లీగ్‌ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యం లోనే క్రికెట్‌ ఫ్యా న్స్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023 సీజన్ కు దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ముంబై ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

అయితే, ఈ వార్త మరువక ముందే ముంబైకి మరో షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ జాయ్ రిచర్డ్ సన్ తుంటి గాయంతో ఐపీఎల్ కు దూరమయ్యాడు. రిచర్డ్ సన్ IPL లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఐపీఎల్ కు దూరం అవ్వడం బాధగా ఉందని, త్వరగా కోలుకుని వచ్చే సీజన్ కు మెరుగైన ఆటగాడిగా వస్తానని రీఛర్డ్ సన్ అన్నాడు. 26 ఏళ్ల రీఛర్డ్ సన్ ఆస్ట్రేలియా తరఫున 3 టెస్టులు, 15 వన్డేలు, 18 టీ20 లు ఆడాడు.

Read more RELATED
Recommended to you

Latest news