పాకిస్తాన్ ఇండియా లో వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధం: బాబర్ ఆజామ్

-

ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఇండియా లో వన్ డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఐసీసీ విడుదల చేసింది.. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు తమ తమ ప్రాక్టీస్ లలో మునిగిపోయి ఉన్నారు. కాగా ఈ ప్రపంచ కప్ కు పాకిస్తాన్ వస్తుందా లేదా అన్న అనుమానాలు నిన్న మొన్నటి దాకా ఉండేవి. కానీ తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చేసిన ఒక ప్రకటన వలన అటు పాక్ మరియు ఇండియా అభిమానులు సంతోషంగా ఉన్నారు. తాజాగా బాబర్ ఆజామ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ ఇండియా లో ఎక్కడ మ్యాచ్ లు జరిగినా మేము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఇంతకు ముందు పాకిస్తాన్ కొన్ని గ్రౌండ్ లలో ఆడేందుకు ఇష్టంగా రాలేదన్న వార్తలు అన్నీ ఈ ప్రకటనతో కొట్టుకుపోయాయి అని చెప్పాలి.

ఈ ప్రకటన వలన ఐసీసీ కు కూడా ఒక తలనొప్పి పోయింది.. మరి పాకిస్తాన్ తో ఇండియా ఆడబోయే మ్యాచ్ లకు ఎంత ఉత్కంఠ ఉంటుందో తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news