కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్న మాట నిజ‌మే..? ఇదిగో సాక్ష్యం..?

-

వెస్టిండీస్‌లో ఉన్న భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్ల‌తో క‌లిసి కోహ్లి ప‌లు ప్ర‌దేశాల్లో ఫొటోలు దిగాడు. ఆయా ప్ర‌దేశాల్లో భార‌త ఆట‌గాళ్లు దిగిన ఫొటోల్లో దాదాపుగా ప్లేయ‌ర్లంద‌రూ ఉన్నారు కానీ.. వాటిల్లో ఎక్క‌డా రోహిత్ శ‌ర్మ క‌నిపించ‌లేదు.

ఇటీవ‌లే జ‌రిగిన ఐసీసీ వ‌రల్డ్ క‌ప్ 2019 టోర్నీ ముగింపు ద‌గ్గ‌ర్నుంచీ.. భార‌త క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి, వైఎస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. అయితే తాజాగా విండీస్ టూర్‌కు వెళ్లే ముందు ముంబైలో విలేక‌ర్ల‌తో మాట్లాడిన కోహ్లి.. త‌న‌కు, రోహిత్‌కు మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని, అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని చెప్పాడు. కానీ తాజాగా సోష‌ల్ మీడియాలో కోహ్లి పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల‌ను బ‌ట్టి చూస్తే మాత్రం కోహ్లికి, రోహిత్ శ‌ర్మ‌కు మ‌ధ్య గొడ‌వ‌లు క‌చ్చితంగా ఉన్నాయేమోన‌నిపిస్తోంది.

conflicts between kohli and rohith sharma might be true

భార‌త్ జ‌ట్టు విండీస్ ప‌ర్య‌ట‌న కోసం ఇప్ప‌టికే వెస్టిండీస్‌కు వెళ్ల‌గా.. రేప‌టి నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. అందులో భాగంగా భార‌త్.. వెస్టిండీస్‌తో 3 టీ20లు, 3 వ‌న్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. అయితే వెస్టిండీస్‌లో ఉన్న భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్ల‌తో క‌లిసి కోహ్లి ప‌లు ప్ర‌దేశాల్లో ఫొటోలు దిగాడు. ఓ హోట‌ల్‌లో భోజ‌నం చేసిన భార‌త ఆట‌గాళ్లు, అనంత‌రం స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించారు. అయితే ఆయా ప్ర‌దేశాల్లో భార‌త ఆట‌గాళ్లు దిగిన ఫొటోల్లో దాదాపుగా ప్లేయ‌ర్లంద‌రూ ఉన్నారు కానీ.. వాటిల్లో ఎక్క‌డా రోహిత్ శ‌ర్మ క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో కోహ్లి ఆ ఫోటోల‌ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేయ‌డంతో.. ఇప్పుడంద‌రూ ఆ ఫొటోల్లో రోహిత్ ఎక్క‌డ‌..? అని కోహ్లిని ప్ర‌శ్నిస్తున్నారు.

కోహ్లి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఆ ఫొటోల‌ను చూసిన భార‌త క్రికెట్ అభిమానులంద‌రూ.. రోహిత్ ఎక్క‌డ అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం ఈ ఫొటోల‌ను బ‌ట్టి చూస్తే.. నిజంగానే కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల న‌డుమ విభేదాలు ఉండి ఉండ‌వచ్చ‌ని, అందుకే జ‌ట్టు దిగిన ఫొటోల్లో రోహిత్ లేడ‌ని అంటున్నారు. అయితే దీనిపై అటు కోహ్లి గానీ, ఇటు రోహిత్ గానీ ఇంకా స్పందించ‌లేదు. మ‌రి దీనిపై వారు ఏమ‌ని స్పందిస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news