ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో అదిరిపోయే ట్విస్ట్

-

ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతడిపై దాడికి యత్నించి.. కారును ధ్వంసం చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, భోజ్ పురి నటి సప్నా గిల్ ను పోలీసులు అంధేరి కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో ఆమె అసలు పృథ్వీ షా ఎవరో తెలియనది చెప్పారు.

‘పృథ్వీ షాను నా స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ అడిగాడు. పృథ్వీ షా ఎవరో నాకు తెలియదు. అతను
క్రికెటర్ అని కూడా తెలియదు. మేము ఇద్దరమే ఉన్నాం. పృథ్వీ షాతో పాటు ఎనిమిది మంది స్నేహితులు
ఉన్నారు. ఆ సమయంలో పృథ్వీ షా తాగి ఉన్నారు’ అని సప్నా గిల్‌ కోర్టుకు తెలిపింది.

మరోవైపు కోర్టులో సప్నా గిల్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పృథ్వీ నుంచి సప్నా గిల్‌ రూ.50 వేలు డిమాండ్ చేసిన‌ట్లు వస్తున్న ఆరోప‌ణ‌లను న్యాయవాది ఖండించారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఘటన జరిగిన 15 గంటల తర్వాత షా స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది చెప్పారు. వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news