అహమ్మదాబాద్ టెస్ట్: రిఫండ్ అడుగుతున్న ప్రేక్షకులు..

-

అహమ్మాదాబాద్ లో జరుగిన మూడవ టెస్టులో 10వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత పెద్దదైన మొతేరా స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా గెలవడం అందరికీ ఆనందదాయకమే. కానీ టెస్ట్ మ్యాచ్ మరీ రెండు రోజుల్లోనే ముగియడం అందరికీ షాకింగ్ గా ఉంది. సాధారణంగా టెస్ట్ మ్యాచులు ఐదురోజుల పాటు జరుగుతాయి. కానీ ఈ సారి మరీ రెండు రోజుల్లో మ్యాచ్ పూర్తవడం ఆశ్చర్యకరమే.

టపా టపామని వికెట్లు కోల్పోవడంతో ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ కాస్తా రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు ఆట చూద్దామని టికెట్లు కొనుక్కున్న ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి, రిఫండ్ అడుగుతున్నారు. మ్యాచ్ జరగలేదు కాబట్టి మా డబ్బులు మాకివ్వాలని పోస్టులు పెడుతున్నారు. మరి ఈ విషయమై గుజరాత్ క్రికెట్ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news