ధోనీతో 22 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దిగిన ఫొటో షేర్ చేసిన బాలీవుడ్ అగ్ర హీరో…!

-

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో దిగిన ఒక ఫోటోని బాలీవుడ్ యువ, అగ్ర హీరో రణవీర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఈ ఫోటోని షేర్ చేసారు. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో కొన్ని త్రోబ్యాక్‌లను పోస్ట్ చేసాడు. తన “అత్యంత విలువైన ఆస్తులలో” ఒకటి అంటూ పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలో అతని వయసు 22 ఏళ్ళు అని చెప్పాడు.

ఎంఎస్ ధోని నటించిన యాడ్ ఫిల్మ్ ఫీచర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు అతను రాసాడు. ఇది 2007/08 సంవత్సరంలో కర్జాత్‌లోని ఎన్‌డి స్టూడియోలో తీసిన ఫోటో అని పేర్కొన్నాడు. నాకు అప్పుడు వయసు 22 ఏళ్ళు అని చెప్పాడు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. అప్పుడు తాను ఎక్కువ పని చేసినా సరే తక్కువ చెల్లించారని కాని ధోనీతో పని చేశా అని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news