అలా ఆడడం కోహ్లీ వల్ల కూడా కాలేదు.. వీరేంద్ర సెహ్వాగ్

-

ఇంగ్లాండ్ లో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచులో భారత్ ఘనవిజయం సాధించింది. 151పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులంతా సంతోషంగా ఉన్నారు. 1-0తో సిరీస్ లో ముందంజలో ఉన్నందుకు అభినందనలు తెలుపుతున్నారు. ఐతే మ్యాచ్  గెలుపుకు కారణమైన భాగస్వామ్యాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 89పరుగుల భాగస్వామ్యంతో భారత్ ను విజయ తీరాలకు  చేర్చిన టెయిలెండర్లు మహమ్మద్ షమి, బుమ్రాలను తెగ పొగుడుతున్నారు. 9వ వికెట్ వారు జోడించిన పరుగులు ఇండియా గెలుపులో కీలకంగా మారాయి.

ఈ విషయంలో అటు వీరేంద్ర సెహ్వాగ్, వీరి బ్యాటింగ్ శైలిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆటలో పరుగులు చేయడమే కాదు, పరుగులు చేయడానికి వారు కొట్టిన షాట్లు, చాలా ఆకట్టుకున్నాయని, కొన్ని కొన్ని షాట్లు విరాట్ కోహ్లీ కూడా ఆడలేకపోయాడని, కవర్ డ్రైవ్ వంటి షాట్లలో వారి ఆటతీరు చక్కగా ఉందని ప్రశంసించారు. ఏదైతేనేం మొదటి విజయంతో ఇండియా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

Read more RELATED
Recommended to you

Latest news