IPL 2022 : బుమ్రాపై వేటు.. ముంబై తుది జట్టులోకి అర్జున్ టెండూల్కర్..!

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 69 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖాడే స్టేడియం లో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలగనుంది.

అయితే.. ఈ మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌ కు చేరనుంది. ఓడిపోతే.. బెంగళూరు ప్లే ఆఫ్స్‌ కు చేరుతుంది. దీంతో ముంబై గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్‌ ప్రార్థనలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌ 2022లో ఇవాళ ముంబై జట్టు చివరి మ్యాచ్‌ ఆడనుంది.

ఈ నేపథ్యంలో.. పలు మార్పులు చేసేందుకు.. రోహిత్‌ శర్మ ఆలోచన చేస్తున్నారట. బుమ్రాను పక్కకు పెట్టి.. సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ను బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ ఇదే.. జరిగితే.. అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌ ఎంట్రీ.. ఢిల్లీ జట్టుపైన కానుంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news