వావ్: నరాలు తెగే “ఉత్కంఠ” మ్యాచ్ లో ఢిల్లీ విజయం… !

-

కాసేపటి క్రితమే ముగిసిన ఢిల్లీ మరియు గుజరాత్ మ్యాచ్ లో చివరి బంతికి వార్నర్ సేన ఘన విజయాన్ని అందుకొని ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆటగాళ్ళు నిర్ణీత ఓవర్ లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేశారు. అనంతరం 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కూడా పవర్ ప్లే లో పూర్తిగా తేలిపోయింది. సాహ, గిల్ మరియు శంకర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మిల్లర్ పరుగులు చేయకుండా పెవిలియన్ చేరాడు. దీనితో మ్యాచ్ బాధ్యత అంతా కెప్టెన్ హార్దిక పాండ్య పై పడింది..

ఇతను మనోహర్ తో కలిసి 5 వ వికెట్ కు 62 పరుగులు జోడించి దాదాపుగా ఢిల్లీ నుండి మ్యాచ్ ను లాగేసుకునేలా చేశారు. చివరి ఓవర్ లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఇషాంత్ కేవలం 6 పరుగులు ఇచ్చి గుజరాత్ కు షాక్ ఇచ్చాడు. చివరకి నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచింది. హార్ధిక్ ఒక్కడే 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ మరియు ఇషాంత్ లు రెండు వికెట్లు తీయగా, నార్జే మరియు కుల్దీప్ లు తలో వికెట్ ను దక్కించుకున్నారు. ఈ విజయం ఢిల్లీ కి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news