ఐపీఎల్ 2023: ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు.. కష్టాల్లో SRH !

-

ఈ రోజు మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బెంగుళూరు కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ పిచ్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఇక్కడ మొదటి బ్యాటింగ్ చేసిన జట్లకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం డుప్లిసిస్ ను ఓటమి కోరల్లోకి నెడుతుందా అని అంతా ఆలోచిస్తున్నారు. అదొక్క నిర్ణయం మినహా ప్రస్తుతానికి గేమ్ అయితే బెంగుళూరు కంట్రోల్ లోనే ఉంది. SRH తరపున బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి మరియు అభిషేక్ శర్మ లు ఇద్దరూ ఒకే ఓవర్లో అవుట్ అవ్వడంతో బెంగుళూరు ఫ్యాన్స్ లో ఆనందం వచ్చింది. ఇన్నింగ్స్ అయిదవ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన మైకేల్ బ్రాస్ వెల్ మొదటి బంతికి అభిషేక్ శర్మను క్యాచ్ ద్వారా అవుట్ చేయగా , అదే ఓవర్ మూడవ బంతికి ప్రమాదకర త్రిపాఠి ని అవుట్ చేసి SRH ను కష్టాల్లోకి నెట్టేశాడు.

దీనితో SRH ఎప్పటిలాగే ఈదుతోంది… మరి ఈ స్థితి నుండి కోలుకోవలనంటే క్రీజులో ఉన్న మార్ క్రామ్ మరియు క్లాజెన్ లు కుదురుగా ఆడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news