IPL 2022 : చెన్నై విజయాలకు బ్రేక్.. పంజాబ్ గ్రాండ్ విక్టరీ

-

ఐపీఎల్ 15 సీజన్ లో పంజాబ్కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ విజయం సాధించడంతో చెన్నై విజయాలకు బ్రేక్ పడింది. ఆఖరి వరకు రసవత్తరంగా కొనసాగిన ఈ మ్యాచ్ లో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై పంజాబ్ 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కింగ్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.

అనంతరం చేసింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… 20 ఓవర్లలో 176 పరుగులు మాత్రమే చేసి విజయాన్ని చేజార్చుకుంది. అయితే చివర్లో ధోని ఒక సిక్స్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఊపు తెప్పించగా… ఆ తరువాత అవుటయ్యాడు. చెన్నై బ్యటర్ అంబటి రాయుడు 7 8 పరుగులతో పోరాడాడు. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కు ఓటమి తప్పలేదు. ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ కింగ్స్ ఆరో స్థానానికి చేరుకుంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ టోర్నీలో ఇది ఆరవ ఓటమి.

Read more RELATED
Recommended to you

Latest news