IPL 2022 : చెన్నైపై విక్టరీ..నేరుగా ప్లే ఆఫ్స్ కు రాజస్థాన్

-

ఐపీఎల్‌ 2022లో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ కు చేరుకుంది. చెన్నై తో బ్రబోర్న్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్థాన్‌ రాయల్స్.. ప్లే ఆఫ్స్‌ బెర్తు ను ఫైనల్‌ చేసుకుంది. తాజా సీజన్‌ లో ఇప్పటికే గుజరాత్‌, లక్నో జట్లు ప్లే ఆఫ్స్‌ కు చేరగా.. మూడో బెర్తును రాజస్థాన్‌ భర్తీ చేసింది. ఇక మిగిలిన ఆఖరి బెర్తు కోసం బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు రేసులో ఉన్నాయి.

సీజన్‌ లో 14 వ మ్యాచ్‌ ఆడిన రాజస్థాన్‌ కు ఇది 9వ విజయం కాగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు మాత్రం 10 వ ఓటమి. మొత్తంగా రెండు జట్లకు లీగ్‌ దశలో ఇదే చివరి మ్యాచ్‌ కావడం విశేషం. మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి.. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 6 వికెట్ల నష్టానికి 150 పరుగలే చేయగలిగింది.

ఆ జట్టులో మొయిన్‌ అలీ శతక సమాన ఇన్నింగ్స్‌ ఆడినా.. మిడిలార్డర్‌ తేలిపోవడంతో.. చెన్నసూపర్‌ కింగ్స్‌ స్కోరుకే పరిమితమైంది. మొయిన్‌ అలీ తర్వాత జట్లు లో ధోని 26 పరుగులు చేసి.. పర్వాలేదనిపించారు. మొత్తానికి ఈ మ్యాచ్‌ లో 5 వికెట్ల తేడాతో చెన్నైకి ఓటమి తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news