IPL 2022 : రాయల్ ఛాలెంజర్స్‌ను గంగలో కలిపిన సిరాజ్ ఓవర్ !

-

నిన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఫ‌స్ట్ బంతి నుంచి చివ‌రి బంతి వ‌ర‌కు బౌండ‌రీల వ‌ర్షం కురిసింది. ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు త‌మ బ్యాట్లను ఝ‌లిపించారు. దీంతో రెండు జ‌ట్లు కూడా భారీ స్కోరును చేశాయి. చివ‌రికి బెంగళూర్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యం 206ను పంజాబ్… మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ఛేదించింది.

దీంతో బెంగ‌ళూర్ పై పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ లో ఆర్సీబీ ఓటమికి మహ్మద్‌ సిరాజ్‌ కారణమని ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఒకే ఒక్క ఓవర్‌.. మ్యాచ్‌ మొత్తాన్నీ మలుపు తప్పింది.

చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన దశలోబౌలింగ్‌ కు దిగిన సిరాజ్‌.. ఏకంగా.. 25 పరుగులను సమర్పించుకున్నాడు. ఈ దెబ్బకు మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. టార్గెట్‌ ఒక్కసారిగా తగ్గి పోయింది. సిరాజ్‌ ఓవర్‌ ముగిసే సరికి పంజాబ్‌ విజయానికి చివరి రెండు ఓవర్లలో 11 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఇంకో ఓవర్‌ మిగిలి ఉండగానే.. మ్యాచ్‌ ముగించేసింది పంజాబ్‌.

Read more RELATED
Recommended to you

Latest news