శుభ్‌మన్‌ గిల్‌ సిస్టర్ పోస్టుపై నెట్టింట ఫ్యాన్స్‌ వార్‌

-

ఐపీఎల్‌ 2023 సీజన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై గుజరాత్‌ టైటాన్స్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (101) సెంచరీ సాధించాడు. బౌలింగ్‌లో విఫలం కావడంతోపాటు గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (104*) కూడా శతకం బాదేసి బెంగళూరును ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ క్రమంలో గిల్ సోదరి షాహనీల్‌ మ్యాచ్‌ను వీక్షిస్తూ కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ‘ఇది ఎంతో సంతోషకరమైన రోజు’ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ పోస్టుపై గిల్ అభిమానులు అభినందనలు కురిపించగా.. విరాట్ ఫ్యాన్స్‌ మాత్రం ఫైర్ అయ్యారు. ఇరువురు మధ్య సోషల్‌ మీడియాలో వార్‌ ప్రారంభమైంది. కొందరు గిల్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టగా.. మరికొందరు విరాట్‌కు మద్దతుగా గిల్‌ను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.

‘‘నేను విరాట్‌కు పెద్ద ఫ్యాన్‌ను. అయితే, గిల్ అద్భుతంగా ఆడాడు. గిల్ ఫ్యామిలీ విమర్శించే వారు నిజమైన విరాట్ కోహ్లీ అభిమానులు కాలేరు’’ అంటూ విరాట్ ఫ్యాన్స్ గిల్​కు మద్దతిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news