ఆస్ట్రేలియా టూర్ లో మహమ్మద్ సిరాజ్.. హైదరాబాద్ లో తండ్రి మరణం.

-

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ లకి సిద్ధమవుతున్నాడు. ఐతే సిరాజ్ అక్కడ ఉండగా, హైదరాబాద్ లో తన తండ్రి మరణించాడు. 53సంవత్సరాల వయస్సులో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ చివరి శ్వాస విడిచాడు. మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్న కారణంగా అంత్యక్రియలకి రాలేకపోతున్నాడు.

ఈ విషయమై స్పందించిన మహమ్మద్ సిరాజ్, తన తండ్రి చెప్పిన మాటలని గుర్తు చేసుకున్నాడు. మా నాన్నెప్పుడూ చెబుతుండేవాడు.. దేశం గర్వపడేలా ఆడాలని.. ఆ మాట నాకెప్పుడూ గుర్తుంటుందని తెలియజేసాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడే మహమ్మద్ సిరాజ్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. నవంబరు 27వ తేదీ నుండి ఆస్ట్రేలియాతో మ్యాచులు జరగనున్నాయి. మొత్తం రెండు నెలల వరకు భారత జట్టు ఆస్ట్రేలియాలోనే ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news