ఆ స్థానంలో ధోనీని రీప్లేస్ చేసే వాళ్ళు లేరు.. కేఎల్ రాహుల్..

-

భారత క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా సేవలందించిన ధోనీ, తన మొత్తం కెరీర్లో ఎన్నో మరుపురాని విజాయాలని అందించాడు. అటు బ్యాట్స్ మెన్ గా, వికెట్ కీపర్ గా తనదైన ఆటతో జట్టుని విజయ తీరాలకి చేర్చాడు. ఐతే కొద్ది కాలం క్రితమే ధోనీ రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం భారత జట్టుని వికెట్ కీపింగ్ సమస్య ఇబ్బంది పెడుతుంది. రిషబ్ పంబ్ ఉన్నప్పటికీ, అతనిలో స్థిరత్వం లోపించింది. దాంతో కేఎల్ రాహుల్ ఒక్కడి మీదే ఆశలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ తో వికెట్ కీపింగ్ గురించి మాట్లాడగా, ఆసక్తికరమైన సమాధానాలు వెలిబుచ్చాడు. ధోనీ ని రీప్లేస్ చేసే వారు మీరవుతారా అని అడగ్గా, ధోనీలాగా వికెట్ కీపింగ్ చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదు. వికెట్ల వెనక ఆయన చూపించే చురుకుదనం మరో లెవెల్లో ఉంటుంది. అందుకే ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టం అని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news