కేప్ టౌన్ టెస్ట్‌లో రిష‌బ్ పంత్ సెంచ‌రీ

-

ఇండియా, సౌత్ ఆఫ్రికా మ‌ధ్య కేప్ టౌన్ లో మూడో టెస్టు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ ప్ర‌స్తుతం మూడో రోజు ఆడుతుంది. అయితే మూడో రోజు ఆట‌లో టీమిండియా ఆట‌గాడు రిష‌బ్ పంత్ సెంచ‌రీ చేశాడు. 6 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో రిష‌బ్ పంత్ సెంచ‌రీని పూర్తి చేశాడు. కాగ ఈ సెంచ‌రీతో టెస్టుల‌లో 4 సెంచ‌రీలు న‌మోదు అయ్యాయి. అలాగే ఆసియా ఖండం బ‌యట మూడు సెంచ‌రీలు చేసిన భార‌త కీప‌ర్ గా రిష‌బ్ పంత్ రికార్డు సృష్టించారు.

కాగ గ‌తంలో రిషభ్ పంత్ రెండు సెంచ‌రీలు ఆసియా ఖండం బ‌యట చేశాడు. 2018 లో ఇంగ్లాండ్ దేశంలో రిష‌బ్ పంత్ 114 ప‌రుగులు చేశాడు. అలాగే 2019 లో ఆస్ట్రేలియా పై 159 ప‌రుగులు చేశాడు. కాగ రిష‌బ్ పంత్ చేసిన 4 సెంచ‌రీల‌లో మూడు కూడా విదేశాల్లో చేసిన‌వే కావ‌డం విశేషం. కాగ్ ప్ర‌స్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 196 వ‌ద్ద తొమ్మిది వికెట్లు కొల్పొయింది. ప్ర‌స్తుతం క్రిజ్ లో రిష‌బ్ పంత్ తో పాటు బుమ్రా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news