MS DHONI: ఐపీఎల్ 2024 సీజన్ మధ్యలోనే ధోనీ ఔట్..?

-

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ గా ఉన్న మహేంద్రసింగ్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను మార్చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. తాజాగా ఐపిఎల్ ట్రోఫీతో 10 జట్ల కెప్టెన్లు ఇచ్చిన ఫోటోషూట్ లో మహేంద్రసింగ్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.

చెన్నైకి రుతురాజు కెప్టెన్ అని ఐపీఎల్ ట్విట్టర్ అకౌంట్ అధికారికంగా ప్రకటించింది. అటు పంజాబ్ జట్టు కు జితేష్ శర్మ వైస్ కెప్టెన్ అని తెలిపింది. అయితే..ధోని ఈ సీజన్‌ మధ్యలోనే ఇంటికి వెళతాడట. తన ఆరోగ్యం సహకరించకపోవడంతో…ఈ నిర్ణయం తీసుకుంటున్నాడట ధోని. ఇప్పుడు ఈ విషయం వైరల్‌ గా మారింది. కాగా ఇవాళ ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నై చపాక్ స్టేడియంలో జరుగునుంది.

Read more RELATED
Recommended to you

Latest news