రోహిత్‌శర్మను కలిసేందుకు దూసుకొచ్చిన అభిమాని.. రూ. 6.5 లక్షల జరిమానా !

-

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ ప్రత్యర్థిని ఖరారు చేసుకుంది. నేడు సూపర్-12 దశ గ్రూప్-2లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది.

అయితే, ఈ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్ కు చెందిన ఓ అభిమాని తన హీరో రోహిత్ శర్మని కలవాలని అనుకున్నాడు. అంతే, భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు.

గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనుక పరుగులు తీసి మొత్తానికి పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ ను చూస్తూనే అభిమాని ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అతడు రోహిత్ ను కలవకముందే, సిబ్బంది అతడిని పట్టుకొని బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కాగా, మైదానం లోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన ఆ అభిమాని పై రూ. 6.5 లక్షల జరిమానా విధించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news