తీవ్ర అనారోగ్యంతో ఐపీఎల్ మాజీ చైర్మెన్ ల‌లిత్ మోదీ..ఆక్సిజ‌న్ స‌పోర్ట్‌పైనే !

-

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా సోకిందని, న్యూమోనియా కూడా అటాక్ అవడంతో ప్రస్తుతం లండన్ లోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నట్లు ఆయన ఇన్స్టా లో పోస్ట్ చేశాడు.

మూడు వారాలుగా ఇద్దరు డాక్టర్లు 24/7 తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాడు. వారికి ధన్యవాదాలుతెలిపాడు. కాగా, లలిత్ మోదీ గతంలో ఐపీఎల్ మాజీ చైర్మన్ గా పని చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news