ధోనీని దేశానికి అందించినందుకు గర్వంగా ఉంది: గంగూలి

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ… బీసీసిఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ సారధ్యంలో భారత జట్టులో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నేడు అతని పుట్టిన రోజు సందర్భంగా ధోనీ ని జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయం అని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. మెరుగైన ఆటగాళ్లను ఎంపిక చేయడం ప్రతీ కెప్టెన్ బాధ్యత అని గంగూలీ అన్నాడు.

mahendra singh dhoni as commentator for day and night test match
mahendra singh dhoni as commentator for day and night test match

ఆటగాడిపై ఉన్న నమ్మకంతోనే జట్టులోకి తీసుకుంటారని… నేను కూడా ధోనీని అలానే ఎంపిక చేశానని ఆయన గుర్తు చేసుకున్నాడు. అయితే అనుకున్న దానికన్నా అతడు మెరుగ్గా రాణించాడని చెప్పుకొచ్చారు. ఎంత ఒత్తిడి కలిగించే సందర్బంలోనైనా ప్రశాంతంగా ఆడతాడని గంగూలీ కీర్తించాడు. అందుకే 3వ స్థానంలో బ్యాంటింగ్‌కు పంపేవాడిని అని పేర్కొన్నాడు. అయితే ధోనీ భారీ షాట్‌లు ఆడగలడు. అద్భుతమైన మ్యచ్ ఫినిషర్ కూడా అంటూ గొప్ప కెప్టెన్ ని అందించినందుకు గర్వంగా ఉందన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news