రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ వారంలో డిశ్చార్జ్

-

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయి అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పంత్ ఆరోగ్యం పై అభిమానులకు శుభవార్త అందింది. ఈ వారంలోనే రిషబ్ పంత్ ని వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారు. పంత్ ఈ వారంలో డిశ్చార్జ్ అవ్వనున్నట్లు బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ముఖాలికి జరిగిన సర్జరీ సక్సెస్ అయిందని.. పంత్ త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పారు. డిసెంబర్ 30న పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొనడం తెలిసిందే. మొదట డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందగా, మెరుగైన చికిత్స కోసం అతడిని ముంబైలోని ధీరుబాయి కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే పంత్ తిరిగి మైదానంలోకి వచ్చేందుకు 8 నుంచి 9 నెలల సమయం పట్టవచ్చు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news