సెమీస్ లో దారుణంగా ఓడిన టీమిండియాకు భారీ ఫ్రైజ్ మనీ

-

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టిన టీమ్ ​ఇండియా ఇప్పుడు మరో పర్యటనకు రెడీ అవుతోంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

ఇది ఇలా ఉండగా…ప్రపంచ కప్‌ గ్రూప్ దశలో జోరు చూపించే, సెమీస్ లో ఓడిన భారతి జట్టుకు ప్రైజ్ మనీ కింద ఎంత సొమ్ము అందుతుందో తెలుసా? అక్షరాల 4 లక్షల డాలర్లు. మన లెక్కల్లో రూ. 3.22 కోట్లపైనే అన్నమాట. సెమీఫైనల్ లోనే ఓడిన కివిస్ కు కూడా ఇంతే మొత్తం దొరుకుతుంది.

దీనికి తోడు గ్రూప్ దశలో ఈ జట్లు సాధించిన ఒక్కో విజయానికి ఆధారంగా 40 వేల డాలర్లు అందుతాయి. గ్రూప్ దశలో భారత జట్టు నాలుగు విజయాలు సాధించింది. అంటే సెమీస్ ప్రైజ్ మనీతో పాటు అదనంగా రూ. 1.2 కోట్లపైగా నగదు బహుమతి లభిస్తుంది. ఇక మిగతా జట్లకు దక్కే ప్రైజ్ మనీ లెక్కలు చూసుకుంటే, ఈ టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు అందుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news