ఒలింపిక్స్ : కాంస్య పోరులో భారత హాకీ జట్టు విజయం..!

-

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం అందుకున్న భారత హాకీ జట్టు ప్యారిస్ ఒలింపిక్స్ లో మళ్ళీ ఆ ఫీట్ ను రిపీట్ చేసింది. సెమీ ఫైనల్స్ లో జర్మనీ చేతిలో ఓడిన భారత జట్టు.. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ స్పెయిన్ జట్టు పై 2-1 తేడాతో విజయం సాధించి 2024 ఒలింపిక్స్ లో ఇండియాకు నాలుగో మెడల్ ను అందించింది.

ఈ ఒలింపిక్స్ లో గ్రూప్ స్టేజిలో కఠినమైన గ్రూప్ లో పడిన భారత జట్టు మెడల్ గెలవడం కష్టం అనుకున్నారు. కానీ ఆంచనాలకు మించి రాణించి ఆసీస్ ను ఓడించి సెమీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన భారత జట్టు.. అనూహ్యంగా జర్మనీ చేత్లో ఓడింది. ఇక ఈ రోజు కాంస్యం కోసం జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ ఆట ప్రారంభంలోనో గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ చివరి నిమిషంలో గోల్ చేసి స్కోర్ సమం చేసిన భారత్.. సెకండ్ హాఫ్ లో మరో గోల్ చేసి వహివారి వరకు లిడ్ ను కాపాడుకొని విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version