సెమీస్‌ కు ముందు టీమిండియాకు షాక్‌..రోహిత్‌ కు కుడి చేతికి గాయం

-

T20World Cup 2022 : సెమీస్‌ కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. ఈ నెల 10వ తేదీన అంటే ఎల్లుండి సెమీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో.. రెండు జట్లు ప్రాక్టిస్‌ లో మునిగిపోయాయి.

అటు ఫామ్‌ లో లేని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ప్రాక్టిస్‌ చేశాడు. ఈ తరుణంలో.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తీవ్ర గాయం అయింది. అడిలైడ్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కుడి చేతికి గాయం అయింది. దీంతో రోహిత్‌ శర్మ.. సెమీ ఫైనల్‌ లో ఆడతాడా లేదా అనేది తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news