ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..3 నెలల పాటు ఉచితంగా బియ్యం

-

ఏపీలో పేదలకు గుడ్ న్యూస్ అందింది. ఏపీలో పేదలకు ఉచితంగా బియ్యం ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మూడు నెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతినెల 19 నుంచి 28 లోగా బియ్యాన్ని జాతీయ ఆహార భద్రత కార్డుదారులు రేషన్ దుకాణాల దగ్గర తీసుకోవాలని సూచించారు.

కొంత నాన్ సార్టెక్స్, మరికొంత నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మన్యం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు నాన్ సార్టెక్స్ మిగిలిన 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టి పైడ్ బియ్యాన్ని సరాపరా చేస్తున్నారు.

అలాగే 2.68 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారుల జాబితాను చౌక దుకాణాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఒక్క వ్యక్తికి ఐదు కిలోల వంతున బియ్యం ఇస్తారు. ఏడు జిల్లాల్లో ఫోర్టీ ఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news