IND VS BAN : కొంపముంచిన KLరాహుల్!

-

టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవిచూసింది. బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా 136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్ ను భారత ఫీల్డర్లు తమకు మాత్రమే సాధ్యమైనా చెత్త ప్రదర్శనతో గెలిపించారు. లేని పరుగులు ఇచ్చి, బౌండరీ వెళ్లేందుకు బంతికి దారి చూపి బంగ్లాదేశ్ విజయానికి దోహదపడ్డారు.

ముఖ్యంగా కేఎల్ రాహుల్ కీలక సమయంలో మెహిదీ హాసన్ క్యాచ్ జారవిడిచి టీమిండియా ఓటమి కి ప్రధాన కారకుడయ్యాడు. 42.3వ ఓవర్ లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేవగా, సునాయాసంగా అందుకోవాల్సిన క్యాచ్ ను రాహుల్ జారవించాడు. అప్పటికి బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 32 పరుగులు అవసరం ఉండింది. ఈ క్యాచ్ ను రాహుల్ పట్టుకున్నట్లయితే టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. రాహుల్ ఇచ్చిన లైఫ్ తో చెలరేగిపోయిన మెహిదీ హాసన్, ముస్తాఫిజుర్ సహకారంతో ఫోర్లు, సిక్సర్లు బాధ ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news