పాకిస్తాన్ బౌలర్లపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

-

భారత క్రికెట్ అభిమానులు శనివారం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ రెండవ తేదీన ఆసియా కప్ 2023లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలే వేదికగా భారత్ – పాకిస్తాన్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇప్పటికే నేపాల్ తో జరిగిన ఆరంభ పోరులో గెలిచిన పాకిస్తాన్ ఆసియా కప్ లో శుభారంభం చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలింగ్ జట్టు పాకిస్తాన్ దేనని అన్నారు. పాకిస్తాన్ జట్టుకి బౌలింగే బలం అని.. వారి వద్ద అద్భుతమైన బౌలర్లు ఉన్నారని పేర్కొన్నారు. వారి బౌలింగ్ నైపుణ్యంతో ఏ సమయంలోనైనా మ్యాచ్ ని మలుపు తిప్పగలరని అన్నారు. అలాంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే అద్భుత ఆట తీరును కనబరచాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news