ఒలంపిక్స్ 2024 : బ్యాడ్మింటన్ లో శుభారంభం..!

-

ఒలంపిక్స్ 2024 లో భారత జట్టు మెడల్స్ ఆశించే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒక్కటి. తప్పకుండ బ్యాడ్మింటన్ లో ఇండియా రేడు లేదా మూడు మెడల్స్ గెలుస్తుంది అనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అందుకు తగ్గిన విధంగానే పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ శుభారంభం అందించాడు. గ్రూప్ స్టేజిలో తన ప్రత్యధి అయిన కెవిన్ హరోల్డో కోర్డన్ పై వరుస సెట్లలో విజయం అందుకున్నాడు.

మొదటి సెట్ లో 21-8 తో సులువుగానే విజయం సాధించిన లక్ష్యసేన్ రెండో సెట్ లో కెవిన్ హరోల్డో గట్టి పోటీ ఇచ్చాడు. చివరి వరకు ఆధిక్యం ప్రదర్శించాడు. కానీ చివర్లో 22-20 తో రెండో సెట్ ను కూడా సొంతం చేసుకొని మ్యాచ్ లో విజయం అందుకున్నాడు. ఇక తన తర్వాతి మ్యాచ్ లో లక్ష్యసేన్ బెల్జియం ఆటగాడిని ఎదుర్కోనున్నాడు. ఈ మ్యాచ్ 29 నాడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news