IPL 2023 : ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం..13 ప్లేయర్లు ఔట్‌

-

IPL 2023 : IPL 2023 మినీ యాక్షన్‌ నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదులుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టు ఇంత మందిని తొలగించడం ఇదే మొదటిసారి.

ముంబై జట్టు వదులుకున్న ఆటగాళ్ల జాబితాలో, కీరన్ పొలార్డ్, అన్ మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, సంజయ్ యాదవ్, రిలే మెరిడిత్, టైమల్ మిల్స్, డానియేల్ సామ్స్, ఫాబియన్ అల్లెన్, జయదేవ్ ఉనదక్కత్ ఉన్నారు.

అంటే, వేలంలో ముంబై ఫ్రాంచైజీ 13 మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. వీళ్ళలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు. ఇక అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా చూస్తే, కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ డేవిడ్, రమణదీప్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రేవిస్, జోఫ్రా అర్చర్, బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కార్తికేయలను రిటైన్ చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news