తిరుమల భక్తులకు శుభవార్త.. ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

-

BREAKING : తిరుమల భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. డిసెంబర్ నెల కోటా వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది టీటీడీ పాలక మండలి. కాసేపటి క్రితమే.. డిసెంబర్ నెల కోటా వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది టీటీడీ పాలక మండలి.

ttd

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది టీటీడీ పాలక మండలి. దీంతో ఈ టికెట్ల కోసం… ఆన్‌ లైన్‌ బాట పట్టారు తిరుమల భక్తులు. ఈ తిరుమల టికెట్ల కోసం https://tirupatibalaji.ap.gov.in/#/login వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నిన్న 71,461 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news