IND VS PAK : టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు..ఫ్యాన్స్‌ ఫైర్‌ !

-

IND VS PAK : పాకిస్తాన్ పేరున్న టీమిండియా జెర్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆసియా కప్ టోర్నికి ఈసారి పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. హోస్ట్ కంట్రీ పేరు… ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జట్ల జెర్సీలపై ముద్రిస్తారు. అందులో భాగంగానే భారత జెర్సీలపై ముద్రించినట్లు వార్తలు వస్తున్నాయి.

మరి ఈ జెర్సీలతోనే భారత్ బరిలోకి దిగుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, వన్డే వరల్డ్ కప్ 2023లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నిర్ణయించిన తేదీ కన్నా ముందే జరగనుంది. అక్టోబర్ 14న మ్యాచ్ జరగనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉండగా… అదే రోజు నవరాత్రి ప్రారంభం కానుండడంతో ముందు రోజుకు మార్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news